చంద్రబాబు ప్రభుత్వం పోతుందని ప్రజలకి తెలిసిపోయింది: వైఎస్ జగన్

- July 16, 2025 , by Maagulf
చంద్రబాబు ప్రభుత్వం పోతుందని ప్రజలకి తెలిసిపోయింది: వైఎస్ జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

“మరో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని ప్రజలకి తెలిసిపోయింది. తమ సమస్యలు చంద్రబాబు పరిష్కరించరని ప్రజలకు అర్థం అయ్యింది. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అనే భావనకు ప్రజలు వచ్చేశారు. తమకున్న ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజలు వైసీపీ తలుపు తడుతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూల్ చేసి చినబాబుకి సగం, ఎమ్మెల్యేలకు సగం ఇస్తున్నారు. ఇవన్నీ భరించలేక సిద్దార్థ్ కౌశిల్ లాంటి యంగ్ అధికారులు వీఆర్‌ఎస్‌ తీసుకుని వెళ్లిపోతున్నారు” అని జగన్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com