ఏపీ: నామినేటెడ్ ప‌దవుల భ‌ర్తీ!

- July 17, 2025 , by Maagulf
ఏపీ: నామినేటెడ్ ప‌దవుల భ‌ర్తీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ కూటమి నేతలకు గుడ్‌న్యూస్ చెప్పింది.కొత్తగా 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు సంబంధిత ప్రభుత్వం అధికారికంగా జీవో (GO)ను విడుదల చేసింది.

జారీ చేసిన జీవో ప్రకారం,ఈ 66 చైర్మన్ పదవుల్లో 17 బీసీలకు,10 ఎస్సీలకు, 5 ఎస్టీలకు, 5 మైనారిటీ నేతలకు అవకాశం కల్పించనున్నారు.ముఖ్యంగా 35 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు మహిళలకు కేటాయించడమే ఈ నియామకాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే 9 పదవులు జనసేనకు, 4 బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com