ధోఫర్ లో ఎనిమిది మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!

- July 20, 2025 , by Maagulf
ధోఫర్ లో ఎనిమిది మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!

మస్కట్: సలాలాలోని దక్షిణ అవ్కాద్ ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్‌లోఅగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందగానే ధోఫర్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకున్న ఎనిమిది మందిని అథారిటీ టీమ్స్ రక్షించాయి. వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అథారిటీ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com