షార్జాలో అపార్ట్మెంట్లో మహిళ అనుమానస్పద మృతి..!!
- July 21, 2025
షార్జా: షార్జాలోని రోల్లా పార్క్ సమీపంలోని తన అపార్ట్మెంట్లో 30 ఏళ్ల భారతీయ మహిళ అనుమానస్పద రీతిలో మృతి చెందింది. అతుల్య శేఖర్గా గుర్తించబడిన ఆ మహిళ, సమీపంలోని మాల్లో ఉన్న ఒక కంపెనీలో కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈలోగానే అనుమానస్పదన రీలితో మరణించి కనిపించిందని సామాజిక కార్యకర్తలు తెలిపారు.
ఈ విషాద సంఘటనకు సంబంధించి భారత కాన్సులేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. “అతుల్య శేఖర్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.మా బృందం వారి కుటుంబం మరియు షార్జా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేము సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నాము.” అని కాన్సులేట్ ప్రెస్ వింగ్ తెలిపింది.
సామాజిక కార్యకర్త అబ్దుల్లా కమమలం ప్రకారం.. అతుల్య గత రెండు సంవత్సరాలుగా షార్జాలో నివసిస్తున్నారు. ఆమె తన పుట్టినరోజును సమీపంలో నివసించే తన సోదరితో కలిసి జరుపుకుంది.త్వరలోనే తను ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిందని పేర్కొన్నారు. కాగా, 2014 లో వివాహం జరిగిందని, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని ప్రాథమికంగా తెలుస్తుందని తెలిపారు. అతుల్య భర్తతో కలిసి ఉంటుండగా, వాళ్లకు 10 ఏళ్ల కుమార్తె(ఇండియాలో చదువుకుంటుంది) ఉంది.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!







