షార్జాలో అపార్ట్మెంట్లో మహిళ అనుమానస్పద మృతి..!!
- July 21, 2025
షార్జా: షార్జాలోని రోల్లా పార్క్ సమీపంలోని తన అపార్ట్మెంట్లో 30 ఏళ్ల భారతీయ మహిళ అనుమానస్పద రీతిలో మృతి చెందింది. అతుల్య శేఖర్గా గుర్తించబడిన ఆ మహిళ, సమీపంలోని మాల్లో ఉన్న ఒక కంపెనీలో కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈలోగానే అనుమానస్పదన రీలితో మరణించి కనిపించిందని సామాజిక కార్యకర్తలు తెలిపారు.
ఈ విషాద సంఘటనకు సంబంధించి భారత కాన్సులేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. “అతుల్య శేఖర్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.మా బృందం వారి కుటుంబం మరియు షార్జా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేము సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నాము.” అని కాన్సులేట్ ప్రెస్ వింగ్ తెలిపింది.
సామాజిక కార్యకర్త అబ్దుల్లా కమమలం ప్రకారం.. అతుల్య గత రెండు సంవత్సరాలుగా షార్జాలో నివసిస్తున్నారు. ఆమె తన పుట్టినరోజును సమీపంలో నివసించే తన సోదరితో కలిసి జరుపుకుంది.త్వరలోనే తను ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిందని పేర్కొన్నారు. కాగా, 2014 లో వివాహం జరిగిందని, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని ప్రాథమికంగా తెలుస్తుందని తెలిపారు. అతుల్య భర్తతో కలిసి ఉంటుండగా, వాళ్లకు 10 ఏళ్ల కుమార్తె(ఇండియాలో చదువుకుంటుంది) ఉంది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్