G20 శిఖరాగ్ర సమావేశంలో తక్షణ సంస్కరణలకు సౌదీ పిలుపు..!!
- July 21, 2025
కేప్ టౌన్: దక్షిణాఫ్రికా అధ్యక్షతన జూలై 17–18 తేదీలలో జరిగిన మూడవ G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో సౌదీ ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్-జాదాన్ పాల్గొని, తక్షణ సంస్కరణకు పిలుపునిచ్చారు. మారుతున్న ఆర్థిక వాస్తవాలకు ప్రతిస్పందనగా ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో సంస్కరణలను వేగవంతం చేయవలసిన తక్షణ అవసరాన్ని తెలియజేశారు. “ఫైనాన్సింగ్ అవసరాలు పెరుగుతున్న సమయంలో అధిక రుణ ఖర్చులు..ప్రభుత్వాలు,ప్రైవేట్ రంగం రెండింటిపై ఒత్తిడి పెరుగుతోంది” అని అల్-జాదాన్ తన ప్రసంగంలో అన్నారు. ఆర్థిక ఒత్తిడి లేదా స్వల్పకాలిక ద్రవ్యత సవాళ్లను ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతు ఇవ్వడం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్లో జరిగిన ఈ సమావేశంలో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు, ఆహ్వానించబడిన దేశ ప్రతినిధులు, అంతర్జాతీయ, ప్రాంతీయ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







