సోషల్ మీడియాలో ట్రేడింగ్ స్కామ్.. ముఠా అరెస్టు..!!
- July 21, 2025
దుబాయ్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా నకిలీ ట్రేడింగ్, పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడం ద్వారా ఆన్లైన్ మోసానికి పాల్పడిన ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఫోన్ కాల్స్ మరియు సోషల్ మీడియా ప్రకటనల ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకుని, ప్రసిద్ధ ట్రేడింగ్ , పెట్టుబడి ప్లాట్ఫామ్ల పేరిట నిందితులు మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి చేతిలో మోసపోయిన వ్యక్తుల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.
ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇటీవలి నెలల్లో వందలాది మంది పెట్టుబడిదారులను ఆర్థికంగా నష్టపరిచిన సిగ్మా-వన్ క్యాపిటల్, డట్ఎఫ్ఎక్స్, ఇవిఎం ప్రైమ్, యుట్రేడ్, ఇవిఎ మార్కెట్లు, కోర్ ఫైనాన్షియల్ మార్కెట్లతో సహా మోసపూరిత ప్లాట్ఫారమ్ల వెనుక సిండికేట్ ఉందని తెలిపారు. పదివేల మంది యూఏఈ నివాసితులు నకిలీ పెట్టుబడి ప్రణాళికలకు తమ జీవిత పొదుపులను కోల్పోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను eCrime ప్లాట్ఫామ్, దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా లేదా 901ని సంప్రదించడం ద్వారా నివేదించాలని నివాసితులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







