సోషల్ మీడియాలో ట్రేడింగ్ స్కామ్.. ముఠా అరెస్టు..!!
- July 21, 2025
దుబాయ్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా నకిలీ ట్రేడింగ్, పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడం ద్వారా ఆన్లైన్ మోసానికి పాల్పడిన ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఫోన్ కాల్స్ మరియు సోషల్ మీడియా ప్రకటనల ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకుని, ప్రసిద్ధ ట్రేడింగ్ , పెట్టుబడి ప్లాట్ఫామ్ల పేరిట నిందితులు మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి చేతిలో మోసపోయిన వ్యక్తుల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.
ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇటీవలి నెలల్లో వందలాది మంది పెట్టుబడిదారులను ఆర్థికంగా నష్టపరిచిన సిగ్మా-వన్ క్యాపిటల్, డట్ఎఫ్ఎక్స్, ఇవిఎం ప్రైమ్, యుట్రేడ్, ఇవిఎ మార్కెట్లు, కోర్ ఫైనాన్షియల్ మార్కెట్లతో సహా మోసపూరిత ప్లాట్ఫారమ్ల వెనుక సిండికేట్ ఉందని తెలిపారు. పదివేల మంది యూఏఈ నివాసితులు నకిలీ పెట్టుబడి ప్రణాళికలకు తమ జీవిత పొదుపులను కోల్పోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను eCrime ప్లాట్ఫామ్, దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా లేదా 901ని సంప్రదించడం ద్వారా నివేదించాలని నివాసితులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









