టీటీడీ కీలక నిర్ణయం..
- July 21, 2025
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రులకు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారికి గుడ్న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను పెంచింది. ప్రస్తుతం రోజులో 25 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ..వాటిని 01 ఆగష్టు నుంచి 50కు పెంచే అవకాశముంది.దీంతో ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 50 వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు ప్రజలు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (APNRT) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీకి సూచించారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లు మంజూరు చేసే అవకాశముంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!