టీటీడీ కీలక నిర్ణయం..
- July 21, 2025
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రులకు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారికి గుడ్న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను పెంచింది. ప్రస్తుతం రోజులో 25 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ..వాటిని 01 ఆగష్టు నుంచి 50కు పెంచే అవకాశముంది.దీంతో ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 50 వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు ప్రజలు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (APNRT) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీకి సూచించారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లు మంజూరు చేసే అవకాశముంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







