పార్టీ ప్రయోజనాల కంటే దేశమే గొప్ప: ప్రధాని మోదీ
- July 21, 2025
న్యూఢిల్లీ: పార్టీ ప్రయోజనాలకంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు భారత ప్రధాని మోదీ.. ఆపరేషన్ సిందూర్ తో మన ఆర్మీ శక్తిసామార్ద్యాలు ప్రపంచ దేశాలు గర్తించాయని చెప్పారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కోసం లోక్ సభకు వచ్చే ముందు ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్లో మన దేశ సైనికుల సత్తా చూశామన్నారు. అందులో వందశాతం లక్ష్యాలను సాధించమని చెప్పారు. కచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని అంటూ . ఈ ఆపరేషన్తో మేడిన్ ఇండియా సైనిక సామర్థ్యం, గొప్పతనం ఏంటో ప్రపంచం చూసిందన్నారు ప్రధాని. ఆపరేషన్ సిందూర్పై మన ఎంపీలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించి వివరించారని ప్రధాని గుర్తుచేశారు. పాక్ దుష్ట చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టారని అన్నారు. . ఈ మధ్య కాలంలో తాను ఎవరిని కలిసినా మేడిన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు. తుపాకులు, బాంబుల ముందు మన రాజ్యాంగం బలంగా నిలబడిందని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని వేడుక చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాక్షించారు.
దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయమిది అని పిలుపు ఇచ్చారు. ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే 90 శాతం నక్సలైట్ల స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు.. కలుగులో ఉన్న మావోయిస్ట్ లను బయటకు రప్పించామన్నారు..దేశంలో నక్సల్ ఉధ్యమం అంతరించినట్లేనని అన్నారు.. ప్రస్తుతం.మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని మోదీ వెల్లడించారు.
శుభాంశు యాత్ర స్ఫూర్తిదాయకం.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన మువ్వనన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు మోదీ. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ అని, . ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని మోదీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా వర్షాలు బాగా కురుస్తున్నాయని, ఇది రైతులకు ఎంతో లాభదాయకమని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడ్డాయని తెలిపారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









