హైదరాబాద్ లో హరి హర వీర మల్లు ప్రెస్ కాన్ఫరెన్స్
- July 21, 2025
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు హైదరాబాద్లో స్పెషల్ ప్రెస్మీట్ను ఏర్పాటు చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు.
‘నేను యాక్సిడెంటల్గా నటుడిని అయ్యాను. గచ్చతరం లేక టెక్నీషియన్ అయ్యాను. సినిమాల్లో నటించడం తప్ప సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. ఏఎం రత్నం కోసమే మీడియా ముందుకు వచ్చాను.సినిమా బతకాలి. ఆయన కష్టానికి ఫలితం దక్కాలి అని ప్రెస్మీట్ను నిర్వహిస్తున్నాం. ‘అని పవన్ అన్నారు.
‘నేను పాలిటిక్స్ వలన సినిమాకు దూరంగా వెళ్లిన కూడా నేను మళ్ళి సినిమా చేయాలనీ రత్నం అడిగినపుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత ఈ సినిమా కోసం ఇచ్చాను.నేను ఉన్న పరిస్థితుల్లో సినిమా కోసం టైమ్ ఇవ్వాలేను. అలాంటిది ఈ సినిమా క్లైమాక్స్ కోసం 57 రోజులు ఇచ్చాను. నా వంతుగా ఎంత చేయాలో అంత సపోర్ట్ ఇచ్చాను.’ అని పవన్ తెలిపారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం