2025 మొదటి అర్ధభాగంలో రికార్డు సృష్టించిన సౌదీ రైల్వేలు..!!
- July 22, 2025
రియాద్: సౌదీ అరేబియా రైల్వేలు (SAR) 2025 మొదటి అర్ధభాగంలో రికార్డు సృష్టించాయి. ఉత్తర, తూర్పు,హరమైన్ హై-స్పీడ్ రైలు నెట్వర్క్లలో 21,000 కంటే ఎక్కువ ట్రిప్పులలో 7.93 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసింది. 2024లో ఇదే కాలంతో పోలిస్తే 8% పెరుగుదల నమోదైంది. హజ్ సీజన్లో అసాధారణమైన సేవ ద్వారా బలమైన పనితీరు బలపడిందన్నారు.దీనిలో హరమైన్ లైన్ ద్వారా 1.2 మిలియన్ల మంది యాత్రికులు , మషైర్ మెట్రో ద్వారా 1.8 మిలియన్ల మంది ప్రయాణం చేశారు.
అదే సమయంలో సరుకు రవాణా వైపు, SAR 14.93 మిలియన్ టన్నుల ఖనిజాలు, వస్తువులను(13శాతం పెరుగుదల) తరలించింది.తద్వారా 72 మిలియన్ లీటర్లకు పైగా ఇంధన ఆదాతోపాటు 190,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం జరిగిందని SAR సీఈఓ డాక్టర్ బషర్ అల్-మాలిక్ తెలిపారు.జాతీయ పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని, సౌదీ ప్రతిభకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక









