2025 మొదటి అర్ధభాగంలో రికార్డు సృష్టించిన సౌదీ రైల్వేలు..!!
- July 22, 2025
రియాద్: సౌదీ అరేబియా రైల్వేలు (SAR) 2025 మొదటి అర్ధభాగంలో రికార్డు సృష్టించాయి. ఉత్తర, తూర్పు,హరమైన్ హై-స్పీడ్ రైలు నెట్వర్క్లలో 21,000 కంటే ఎక్కువ ట్రిప్పులలో 7.93 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసింది. 2024లో ఇదే కాలంతో పోలిస్తే 8% పెరుగుదల నమోదైంది. హజ్ సీజన్లో అసాధారణమైన సేవ ద్వారా బలమైన పనితీరు బలపడిందన్నారు.దీనిలో హరమైన్ లైన్ ద్వారా 1.2 మిలియన్ల మంది యాత్రికులు , మషైర్ మెట్రో ద్వారా 1.8 మిలియన్ల మంది ప్రయాణం చేశారు.
అదే సమయంలో సరుకు రవాణా వైపు, SAR 14.93 మిలియన్ టన్నుల ఖనిజాలు, వస్తువులను(13శాతం పెరుగుదల) తరలించింది.తద్వారా 72 మిలియన్ లీటర్లకు పైగా ఇంధన ఆదాతోపాటు 190,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం జరిగిందని SAR సీఈఓ డాక్టర్ బషర్ అల్-మాలిక్ తెలిపారు.జాతీయ పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని, సౌదీ ప్రతిభకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







