'లిటిల్ మున్సిపల్ విలేజ్' వాలంటీర్లకు సత్కారం..!!
- July 22, 2025
మనామా: జూలై 12 నుండి 18 వరకు రిఫాలోని ఒయాసిస్ మాల్లో నిర్వహించిన "లిటిల్ మున్సిపల్ విలేజ్" కార్యక్రమం విజయవంతమైంది. ఇందుకు దోహదపడిన వాలంటీర్లను ఘనంగా సత్కరించనున్నట్లు సదరన్ ఏరియా మునిసిపాలిటీ తెలిపింది.పిల్లలలో పర్యావరణ అవగాహనను పెంపొందించడానికి విద్యాపరమైన విధానాన్ని తీసుకురావడంపై సదరన్ ఏరియా మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంగ్లండ్ ఇసా అబ్దుల్రెహ్మాన్ అల్ బుయైనైన్, సదరన్ మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్లా ఇబ్రహీం అబ్దుల్లతీఫ్ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మక విధానంలో పిల్లలకు పర్యావరణ సందేశాలను అందించడంలో కీలక పాత్ర పోషించిన అనేక మంది వాలంటీర్లు, ప్రభుత్వ-ప్రైవేట్ రంగ భాగస్వాములు, బహ్రెయిన్ కళాకారులు, యువజన సంఘాలను వారు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పర్యావరణ ఆధారిత ప్రదర్శనలను పిల్లలు నిర్వహించారు.ఫేస్ పెయింటింగ్ బూత్లతో పాటు పర్యావరణ ఇతివృత్తాలను చెప్పే సెషన్లు, మునిసిపల్ పాత్రల గురించి చిన్న విద్యా సంబంధిత పిక్చర్స్, ప్రసిద్ధ మస్కట్లు "సయీద్", "డ్రూబీ"లు అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్