WCL 2025లో భారత్ పాక్ మ్యాచ్ రద్దు..
- July 22, 2025
లండన్: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ రద్దు అవ్వడం పెద్ద చర్చకు దారితీసింది.దేశాల మధ్య ఉద్రిక్తతల వల్లే ఈ మ్యాచ్ ఆగిపోయిందని మొదట వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత, కొంతమంది భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడటానికి ఇష్టపడలేదని కూడా వినిపించింది.అయితే, ఇప్పుడు ఒక కొత్త విషయం బయటపడింది.మ్యాచ్ రద్దుకు భారత జట్టుకు ఎలాంటి తప్పు లేదని తేలింది.సోమవారం ఏఎన్ఐ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం.. డబ్ల్యూసీఎల్ నిర్వాహకులే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకి, తాము ఈ మ్యాచ్ను నిర్వహించలేకపోయామని చెప్పారట.
డబ్ల్యూసీఎల్ వర్గాలు చెప్పిన దాని ప్రకారం..భారత ఆటగాళ్లు మ్యాచ్ నుంచి తప్పుకోవడం వల్లే ఈ మ్యాచ్ రద్దు అయిందని, అందుకే పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు పాయింట్లను పంచుకోవడానికి అంగీకరించడం లేదని అంటున్నారు.అంటే, భారత్ వెనక్కి తగ్గింది కాబట్టి, తమకే పూర్తి పాయింట్లు ఇవ్వాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది.ఈ మ్యాచ్ గురించి నిర్వాహకులు మాట్లాడుతూ.. “మేమే మ్యాచ్ను నిర్వహించలేకపోయామని ఈసీబీకి చెప్పాం. ఇండియా ఛాంపియన్స్ జట్టుది తప్పు లేదు. కానీ పాకిస్థాన్ ఛాంపియన్స్ మాత్రం, భారత్ తప్పుకుంది కాబట్టి, పాయింట్లు పంచుకోవడానికి ఒప్పుకోవడం లేదు” అని చెప్పారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









