ఇప్పటివరకు ఉప రాష్ట్రపతులుగా పని చేసిన ప్రముఖులు వీరే..

- July 22, 2025 , by Maagulf
ఇప్పటివరకు ఉప రాష్ట్రపతులుగా పని చేసిన ప్రముఖులు వీరే..

న్యూ ఢిల్లీ: జగదీప్ ధన్ ఖడ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసేశారు. తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్య కారణాల వల్లే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు జగదీప్ ధన్ ఖడ్ లేఖలో తెలిపారు.ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేసేశారు.మరి నెక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.ఉప రాష్ట్రపతి పదవి రేసులో ఎవరెవరు ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది.కాగా, ఇప్పటివరకు భారత ఉప రాష్ట్రపతులుగా పలువురు ప్రముఖులు చేశారు. వారు ఎవరెవరో తెలుసుకుందాం.

ఉఫ రాష్ట్రపతి.. భారతదేశపు రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి. రాజ్యసభ ఎక్స్-అఫీషియో ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతి పార్లమెంటు ఎగువ సభకు అధ్యక్షత వహించడమే కాకుండా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతికి కీలకమైన స్టాండ్‌బై పాత్రను కూడా పోషిస్తారు. రాష్ట్రపతి రాజీనామా, మరణం, తొలగింపు లేదా అసమర్థత వంటి సందర్భాల్లో ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకుంటారు. గణతంత్రం ఆవిర్భావం నుండి 13 మంది ఉప రాష్ట్రపతులుగా పనిచేశారు. వీరిలో చాలామంది తర్వాత దేశంలో అత్యున్నత పదవులకు ఎదిగారు.

భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952లో ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆ పదవిని అధిరోహించారు. ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు.

సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత మరో విద్యావేత్త జాకిర్ హుస్సేస్ ఉప రాష్ట్రపతి అయ్యారు. తొలి దశాబ్దాలలో రాజనీతిజ్ఞులు, న్యాయ పండితులు, విద్యావేత్తలు ఈ పదవిని చేపట్టారు. ఈ పదవికి మేధోపరమైన ప్రతిభను జోడించారు.

జాకిర్ హుస్సేన్ తర్వాత వివి గిరి ఉప రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత జెట్టీ, వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణన్ వైస్ ప్రెసిడెంట్లు అయ్యారు. వీరిలో కేఆర్ నారాయణన్ తొలి దళిత రాష్ట్రపత్రిగా ఘనత సాధించారు.

తొలుత విద్యావేత్తలు, న్యాయ పండితులు, రాజనీతిజ్ఞులు ఈ పదవిని అధిరోహించారు. భారత రాజకీయాలు పరిణతి చెందుతున్న కొద్దీ, ఉపాధ్యక్ష పదవి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను ఆకర్షించింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి భైరాన్ సింగ్ షెకావత్ 2000 ప్రారంభంలో ఈ పాత్రకు ప్రాథమిక రాజకీయ అనుభవాన్ని తీసుకువచ్చారు.

విశిష్ట దౌత్య వృత్తిని కలిగి ఉన్న మొహమ్మద్ హమీద్ అన్సారీ 2007 నుండి 2017 వరకు ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. రెండు పర్యాయాలు పదవిలో కొనసాగారు. బీజేపీలో అగ్ర నేతగా గుర్తింపు పొందిన, వాక్చాతుర్యానికి పేరుగాంచిన ఎం. వెంకయ్య నాయుడు 2017 నుండి 2022 వరకు కొనసాగారు. రాజ్యసభలో మర్యాదను పెంపొందించడానికి, పార్లమెంటరీ ఉత్పాదకతపై దృష్టి పెట్టడానికి ఆయన పదవీకాలం గుర్తించబడింది.

వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది అయిన జగదీప్ ధన్ ఖడ్ ఆగస్టు 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. చట్టపరమైన చతురత , రాజకీయ దృఢ సంకల్పం కలగలిసి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రతిపక్ష నాయకులతో విధానపరమైన ఘర్షణలతో తరచుగా వార్తల్లో నిలిచారు.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం పూర్తైన తర్వాత 2022లో ధన్‌ఖడ్ వైస్ ప్రెసిడెంట్​గా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వాను ఓడించి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో పదవీకాలం ముగియకుండా రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతులు చాలా అరుదు. ఇంతకుముందు ఇద్దరు మాత్రమే పదవీకాలం మధ్యలో రాజీనామా చేశారు. తాజా రాజీనామాతో మూడో వైస్ ప్రెసిడెంట్​గా జగదీప్ ధన్‌ఖడ్ నిలిచారు.

  • వీవీ గిరి–1969లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా.
  • ఆర్. వెంకటరామన్–1987లో రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రాజీనామా.
  • జగదీప్ ధన్‌ఖడ్–2025లో అనారోగ్య కారణాలతో రాజీనామా.

ధన్‌ఖడ్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 6 నెలలలోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.మరణం, రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతర కారణాల వల్ల పదవి ఖాళీ అయితే వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com