కొబ్బరి పూరీ
- July 15, 2016
కావలసిన పదార్దములు : కొబ్బరి తురుము : కప్పు , పంచదార : మూడు కప్పులు , మైదా : రెండు కప్పులు , నూనె : నాలుగు కప్పులు , యాలకులు పొడి : టీ స్పూన్ , జీడిపప్పులు, బాదం పప్పులు : కప్పు
తయారుచేయు విధానం :
మైదాను కొద్దిగా నీళ్ళు పోసి పూరీ పిండిలా కలిపి అరగంట పక్కన పెట్టాలి. జీడిపప్పులు, బాదాం పప్పులు చిన్నచిన్న ముక్కలుగా చేసి పక్కనపెట్టాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొబ్బరి తురుము, కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార కరిగి కొబ్బరి ఉడుకుతుంది. కొబ్బరి, పంచదార కలిసి ముద్దగా అవ్వుతుండగా యాలకుల పొడి, జీడిపప్పుముక్కలు వేసి స్టవ్ మీద నుండి దించి చల్లారనివ్వాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కలిపిన మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీలా ఒత్తి, దీనిఫై కొబ్బరి మిశ్రంమం పెట్టి, పైన వేరే పూరీ పెట్టి చుట్టూ అంచులు నొక్కాలి. ఇలా అన్నీ చేసుకొని కాగే నూనెలో దోరగా వేపి తియ్యాలి. ఇప్పుడు మిగిలిన మూడు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పాకం పట్టాలి. తీగపాకం వచ్చాక స్టవ్ ఆపి వేయించిన కొబ్బరి పూరీలను వేసి రెండు నిముషాలు ఉంచి వేరే ప్లేటులో పెట్టుకోవాలి. అరగంట ఆగి డబ్బాలో పెట్టి నిల్వ చేసుకో వచ్చు. అంతే కొబ్బరి పూరీలు రెడీ.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









