కువైట్లో భారత మామిడి, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన..!!
- July 25, 2025
కువైట్: భారత-కువైట్ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ముఖ్యంగా వ్యవసాయ-ఆహార రంగంలో మరింత బలోపేతం చేయడానికి ఒక ప్రధాన అడుగులో, కువైట్లోని భారత రాయబార కార్యాలయం, వ్యవసాయ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సహకారంతో కువైట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (KCCI)లో భారతీయ మామిడి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కీలక సమావేశాన్ని నిర్వహించింది.
APEDA నేతృత్వంలోని భారతదేశం నుండి 10 మంది సభ్యుల ప్రతినిధి బృందం వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, ప్రీమియం భారతీయ వ్యవసాయ-ఎగుమతులను ప్రోత్సహించడానికి కువైట్ను సందర్శించింది. కువైట్లోని భారత రాయబారి, KCCI డైరెక్టర్ జనరల్ సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కువైట్ దిగుమతిదారులు, పంపిణీదారులు, ప్రముఖ హైపర్మార్కెట్ల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతదేశం, కువైట్ మధ్య బలమైన, పెరుగుతున్న వాణిజ్య సంబంధాలను రాయబారి వివరించారు. కువైట్ అగ్ర వాణిజ్య భాగస్వాములలో భారత్ ఒకటి అని, వ్యవసాయ-ఆహార రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. "భారతీయ మామిడి ఎగుమతులకు మొదటి ఐదు గమ్యస్థానాలలో కువైట్ ఒకటి. గత సంవత్సరం దాదాపు USD 3 మిలియన్ల విలువైన దిగుమతులు జరిగాయి." అని ఆయన పేర్కొన్నారు.
అల్ఫోన్సో, బాదామి, సిందూరి వంటి రకాలు ఇప్పటికే కువైట్లో ప్రాచుర్యం పొందినప్పటికీ, భారతదేశంలో అతిపెద్ద మామిడి ఉత్పత్తి రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్ నుండి కొత్త ప్రీమియం మామిడి రకాలను పరిచయం చేయడం, తద్వారా కువైట్ వినియోగదారుల అభిరుచిని విస్తరించడం ఈ చొరవ లక్ష్యం అని రాయబారి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







