ఇరాక్ లో కారుబాంబు పేలి ఆరుగురు మృతి

- July 15, 2015 , by Maagulf
ఇరాక్ లో కారుబాంబు పేలి ఆరుగురు మృతి

ఇరాక్ లో ఉస్ ఉ్రగవాదుల ప్రతీకార దాడిలో అయిదుగురు వ్యక్తులు చనిపోయారు. మరో 11మంది తీవ్ర గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్ నగరానికి సమీపంలోని ఖలిస్ లో పట్టణంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాద చర్యలకు వ్యతికేకంగా పనిచేస్తున్న హషద్ అల్ షాహిబ్ అనే సంస్థను టార్గెట్ చేసిన ఐస్, కారుబాంబ్ అమర్చి ఈ హత్యలకు పూనుకుంది. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్టుగా ఐస్ ఒక లేఖను కూడా విడిచిపెట్టింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఐఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న జిహైదిస్ట్ కార్యకర్తలను మట్టుబెట్టేందుకు ఐఎస్ పథకం రచించిందని ఖలిస్ పోలీసుఅధికారులు వెల్లడించారు. ప్రముఖ వైద్యుని ఇంటిముందు ఈ కార్ బాంబ్ పేలుడు సంభవించిందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com