టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

- July 25, 2025 , by Maagulf
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

తిరుమల: తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పి.సి.రాయల్ గురువారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

అదేవిధంగా బెంగుళూరుకు చెందిన సుకుమార్ అనే భక్తుడు శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com