తమిళనాడు లో ప్రధాని మోదీ రెండోరోజు పర్యటన
- July 27, 2025
చెన్నై: తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రెండో రోజు కూడా ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.శనివారం ఆయన తూత్తుకుడి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ను ప్రారంభించారు. అంతేగాక, రూ.2,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ప్రధానంగా రహదారులు, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
గంగైకొండ చోళపురంలోని దేవాలయ సందర్శన
ఆదివారం, పర్యటన రెండో రోజు భాగంగా ప్రధాని మోదీ అరియలూర్ జిల్లాలోని గంగైకొండ రాజరాజ చోళేశ్వర దేవాలయాన్ని సందర్శించనున్నారు. చోళ రాజు రాజేంద్ర చోళుడు గంగానదీ ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించిన ఈ దేవాలయానికి ఈ ఏడాది వెయ్యేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
స్మారక నాణేం ఆవిష్కరణ
వెయ్యేళ్ల చరిత్రకు గుర్తుగా ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక స్మారక నాణేన్ని ఆవిష్కరించనున్నారు. ఇది చోళ రాజవంశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
బహిరంగ సభకు ప్రధాని హాజరు
పూజా కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకోసం స్థానిక అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణం అంతటా పటిష్ట భద్రతా ఏర్పాట్లు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు, మరియు సీసీ కెమెరాల నిఘా అమలు చేస్తున్నారు.
పంచకట్టు ధరించిన మోదీ–తమిళ జాతికి ప్రత్యేక అభిమానం
తమిళనాడు పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సాంప్రదాయ పంచకట్టు ధరించి ప్రజల మనసులు గెలుచుకున్నారు. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే తమిళనాడు గడ్డపై అడుగుపెట్టడం తనకు అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇది శ్రీరాముని పవిత్ర భూమిగా భావిస్తున్న ఈ ప్రాంతాన్ని గౌరవించే సంకేతంగా ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది–మోదీ హామీ
తమిళనాడు ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నదని ప్రధాని స్పష్టం చేశారు. రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులను తమిళ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా మాట్లాడుతూ, దక్షిణ భారతం కూడా సమానంగా అభివృద్ధి చెందాలన్నదే కేంద్ర లక్ష్యమని ఆయన తెలిపారు .
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









