సింగపూర్లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్కు ఘన స్వాగతం
- July 27, 2025
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకూ, 'బ్రాండ్ ఏపీ'ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు జులై 26 నుంచి 31 వరకు ఆరు రోజుల సింగపూర్ పర్యటనను ప్రారంభించారు.ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, మంత్రి పి.నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా ఉంది.ఈ బృందం జులై 26 రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, జులై 27 ఉదయం 6:30 గంటలకు సింగపూర్ చేరుకుంది.
ఇవాళ చంద్రబాబు కార్యక్రమాలు:
జులై 27న చంద్రబాబు సింగపూర్లోని 'వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్' డిజిటల్ క్యాంపస్లో జరిగే 'తెలుగు డయాస్పొరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా' కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ సమావేశం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో సింగపూర్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల నుంచి సుమారు 1,500 నుంచి 5,000 మంది తెలుగు ప్రవాసీయులు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి మాస్టర్ ప్లాన్, పెట్టుబడి అవకాశాలు,పేదరిక నిర్మూలన కోసం P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్) కార్యక్రమం గురించి వివరిస్తారు.ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఇవాళ చంద్రబాబు భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశమవుతారు.సుర్బానా జురాంగ్, ఎవర్సెండై ఇంజనీరింగ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.రాత్రి భారత హైకమిషనర్ ఆతిథ్యం ఇచ్చే విందులో చంద్రబాబు టీమ్ పాల్గొంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







