25 టన్నుల ఎయిడ్ ను ఎయిర్ డ్రాప్ చేసిన యూఏఈ, జోర్డాన్
- July 28, 2025
యూఏఈ: గాజా స్ట్రిప్పై రెండు జోర్డాన్, ఒక ఎమిరాటీ విమానం 25 టన్నుల మానవతా సహాయాన్ని ఎయిర్ డ్రాప్ చేశాయని జోర్డాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. గాజాలో కొనసాగుతున్న మానవతా కార్యక్రమంలో భాగంగా ఎమిరేట్స్ వెంటనే గాజాకు వైమానిక దళ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. నిరంతర అంతర్జాతీయ సహాయ ప్రయత్నాల అత్యవసర అవసరాన్ని ఇది తెలియజేస్తుందని తన పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు, గాజాలోని కొన్ని ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆదివారం నుండి గాజాలోని మూడు ప్రాంతాలలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కాల్పులకు బ్రేక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









