వాట్సాప్ పరువు నష్టం కేసు.. ఇంటర్నెట్ కట్, ఫోన్ సీజ్..!!

- July 28, 2025 , by Maagulf
వాట్సాప్ పరువు నష్టం కేసు.. ఇంటర్నెట్ కట్, ఫోన్ సీజ్..!!

దుబాయ్: వాట్సాప్ ద్వారా పరువు నష్టం, ఆన్‌లైన్ లో వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు దుబాయ్ కోర్టు ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించింది.  నిందితుడిని ఇంటర్నెట్ వాడకం నుండి నిషేధించింది. అతని మొబైల్ ఫోన్‌ను జప్తు చేయాలని కూడా ఆదేశించింది.

వాట్సాప్‌లో వరుస పరువు నష్టం కలిగించే సందేశాలను అందుకున్న ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.  ఏప్రిల్ 24న, దుబాయ్ కోర్టు నిందితుడి నెట్‌వర్క్‌లు లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయకుండా ఒక నెల నిషేధం విధించింది. అన్ని పరికరాల  నుండి అభ్యంతరకరమైన సందేశాలను తొలగించాలని ఆదేశించింది. నేరం చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను జప్తు చేసింది. అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించడంతోపాటు  Dh5,000 జరిమానా విధించింది. ఈ తీర్పు అధికారికంగా మే 1న అమల్లోకి వచ్చింది. వాట్సాప్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వన్-ఆన్-వన్ ప్రైవేట్ చాట్‌లు కూడా కంటెంట్ చట్టపరమైన లేదా నైతిక సరిహద్దులను దాటితే పరువు నష్టం చట్టాల నుండి మినహాయించబడవని రివ్యూ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com