తిరుపతి - శిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
- July 28, 2025
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి- సాయినగర్ శిద్దీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29వరకు సర్వీసులందిస్తాయని తెలిపింది.
షెడ్యూల్ ఇదే..
తిరుపతి - సాయినగర్ శిద్దీ రైలు (07637) తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే 4గంటలకు బయల్దేరి మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10.45 గంటలకు శిర్జీకి చేరుకోనుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులందిస్తుంది. అలాగే, శిర్జీ- తిరుపతి రైలు (07638) సోమవారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు (తెల్లవారితే బుధవారం) తిరుపతి చేరుకోనుంది. ఈ రైలు సర్వీసులు ఆగస్టు 4నుంచి సెప్టెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి..
రైలు ఆగే స్టాప్ లు..
ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహిరాబాద్, బీదర్, భాల్కి, ఉద్గార్, లాతూర్ రోడ్డు, పర్లి, గంగఖేర్, పర్బని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్ సోల్, మన్మాడ్, కోపర్గావ్ స్టేషన్లలో ఆగనున్నాయి.. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఎసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయి..
తాజా వార్తలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర









