డిగ్రీ ఫోర్జరీకి సంబంధించి ఎనిమిది కేసులు నమోదు..!!
- July 28, 2025
దోహా, ఖతార్: ఫేక్ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) వెల్లడించింది. 2025 మొదటి అర్ధభాగంలో మూడు నకిలీ సర్టిఫికెట్ల కేసులు గుర్తించగా, గత సంవత్సరం మరో ఐదు కేసులు బయటపడ్డాయని మంత్రిత్వ శాఖలోని విశ్వవిద్యాలయ డిగ్రీ సమానత్వ విభాగం డైరెక్టర్ జాబర్ అహ్మద్ అల్-జాబర్ చెప్పారు.
వీటిలో నకిలీ బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అరబ్ దేశాలకు చెందినవి ఉన్నాయని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల ప్రామాణికతను ధృవీకరించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ, దేశ సాంస్కృతిక అటాచ్లతో సహా అధికారిక సంస్థలతో ఈ విభాగం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









