ఆగస్ట్ 5 నుండి తిరుమల లో పవిత్రోత్సవాలు–4న అంకురార్పణ
- August 01, 2025
తిరుమల: తిరుమల : వైఖానస ఆగమోక్తంగా నిత్యకైంకర్యాలు, సేవలు జరిగే తిరుమల శ్రీవేంకటేశ్వం | స్వామి ఆలయంలో ఆగస్ట్ 5వతేదీ నుండి 7వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.ప్రతి ఏదాడి శ్రావణమాసంలో ఈ పవిత్రోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో టిటిడి(TTD) ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చేపడతారు.ఆలయంలో పలురకాలుగా భక్తులవల్ల గానీ, ఆలయ అధికారులు, అర్చకుల వల్ల తెలిసీతెలియక చేసిన తప్పిదాలు, పొరబాట్టు వల్ల దోష నివృత్తికి ఈ పవిత్రోత్సవాలు జరిపించడం ఆనవాయితీ.ఆగస్ట్ 5వతేదీ నుండి మూడురోజులు జరిగే ఈ ఉత్సవాలకు 4వతేదీ సోమవారం రాత్రి అంకురర్పాణ కార్యక్రమం చేపడతారు.5వ తేదీ మంగళవారం ఉదయం నుండి 7వతేదీ గురువారం పవిత్రాలు సమర్పణతో ముగుస్తాయి.ప్రతిరోజూ ఉదయం శ్రీదేవిభూదేవిసమేత.
మలయప్పస్వామి ఉత్సవర్లకు విశేష స్నపనతిరుమంజన అభిషేకాలు జరిపిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కొన్ని ఆర్జితసేవలు రద్దయ్యాయి. పవిత్రోత్సవాలకు గృహస్థ భక్తులను అనుమతినిస్తారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







