ఆగస్ట్ 5 నుండి తిరుమల లో పవిత్రోత్సవాలు–4న అంకురార్పణ
- August 01, 2025
తిరుమల: తిరుమల : వైఖానస ఆగమోక్తంగా నిత్యకైంకర్యాలు, సేవలు జరిగే తిరుమల శ్రీవేంకటేశ్వం | స్వామి ఆలయంలో ఆగస్ట్ 5వతేదీ నుండి 7వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.ప్రతి ఏదాడి శ్రావణమాసంలో ఈ పవిత్రోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో టిటిడి(TTD) ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చేపడతారు.ఆలయంలో పలురకాలుగా భక్తులవల్ల గానీ, ఆలయ అధికారులు, అర్చకుల వల్ల తెలిసీతెలియక చేసిన తప్పిదాలు, పొరబాట్టు వల్ల దోష నివృత్తికి ఈ పవిత్రోత్సవాలు జరిపించడం ఆనవాయితీ.ఆగస్ట్ 5వతేదీ నుండి మూడురోజులు జరిగే ఈ ఉత్సవాలకు 4వతేదీ సోమవారం రాత్రి అంకురర్పాణ కార్యక్రమం చేపడతారు.5వ తేదీ మంగళవారం ఉదయం నుండి 7వతేదీ గురువారం పవిత్రాలు సమర్పణతో ముగుస్తాయి.ప్రతిరోజూ ఉదయం శ్రీదేవిభూదేవిసమేత.
మలయప్పస్వామి ఉత్సవర్లకు విశేష స్నపనతిరుమంజన అభిషేకాలు జరిపిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కొన్ని ఆర్జితసేవలు రద్దయ్యాయి. పవిత్రోత్సవాలకు గృహస్థ భక్తులను అనుమతినిస్తారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









