ఆగస్ట్ 5 నుండి తిరుమల లో పవిత్రోత్సవాలు–4న అంకురార్పణ
- August 01, 2025
తిరుమల: తిరుమల : వైఖానస ఆగమోక్తంగా నిత్యకైంకర్యాలు, సేవలు జరిగే తిరుమల శ్రీవేంకటేశ్వం | స్వామి ఆలయంలో ఆగస్ట్ 5వతేదీ నుండి 7వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.ప్రతి ఏదాడి శ్రావణమాసంలో ఈ పవిత్రోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో టిటిడి(TTD) ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చేపడతారు.ఆలయంలో పలురకాలుగా భక్తులవల్ల గానీ, ఆలయ అధికారులు, అర్చకుల వల్ల తెలిసీతెలియక చేసిన తప్పిదాలు, పొరబాట్టు వల్ల దోష నివృత్తికి ఈ పవిత్రోత్సవాలు జరిపించడం ఆనవాయితీ.ఆగస్ట్ 5వతేదీ నుండి మూడురోజులు జరిగే ఈ ఉత్సవాలకు 4వతేదీ సోమవారం రాత్రి అంకురర్పాణ కార్యక్రమం చేపడతారు.5వ తేదీ మంగళవారం ఉదయం నుండి 7వతేదీ గురువారం పవిత్రాలు సమర్పణతో ముగుస్తాయి.ప్రతిరోజూ ఉదయం శ్రీదేవిభూదేవిసమేత.
మలయప్పస్వామి ఉత్సవర్లకు విశేష స్నపనతిరుమంజన అభిషేకాలు జరిపిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కొన్ని ఆర్జితసేవలు రద్దయ్యాయి. పవిత్రోత్సవాలకు గృహస్థ భక్తులను అనుమతినిస్తారు.
తాజా వార్తలు
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్







