డొనాల్డ్ ట్రంప్ తీరు పై చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ అసహనం
- August 01, 2025
అమెరికా: అమెరికా తీరుపై, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు పై చైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. రష్యా తో వాణిజ్యం చేయొద్దంటూ అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించడంపై తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుండటంపై చైనా అసహనం వ్యక్తం చేసింది.అమెరికా దుర్నీతిని చైనా ఎండగట్టింది.మిగతా దేశాల సంగతి పక్కన పెడితే.. రష్యాతో అమెరికానే భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఈరోజు వరకు కూడా రష్యాతో అమెరికా వాణిజ్యం కొనసాగుతోందని తెలిపింది. ‘రష్యాతో ఇతరులు వాణిజ్యం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా’ అని అమెరికాను ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ నిలదీశారు.
కాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై గెంగ్ షువాంగ్ స్పందిస్తూ.. మిగతా దేశాల కంటే అమెరికానే ఎక్కువగా రష్యాతో వ్యాపారం చేస్తోందన్నారు. ఉక్రెయిన్కు కానీ, రష్యాకు కానీ తాము ఆయుధాలు సరఫరా చేయడంలేదని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్యం మాత్రమే చేస్తున్నామని తెలిపారు. భద్రతా మండలిలో చైనాపై అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను గెంగ్ షువాంగ్ తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్తో తమ వాణిజ్య కార్యకలాపాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు.ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలని అమెరికాకు హితవు పలికారు. అదేవిధంగా ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని, అందుకు కృషి చేయాలని ట్రంప్కు సూచించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







