గ్రీన్ మొబిలిటీ..ఖతార్ లో 300 ఫాస్ట్ EV ఛార్జింగ్ పాయింట్లు..!!
- August 01, 2025
దోహా: ఖతార్ వ్యాప్తంగా 300 కంటే ఎక్కువ ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.EV మౌలిక సదుపాయాల విస్తరణకు ఇది దోహదం చేయనుంది. దాంతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) వెల్లడించింది.అల్ తుమామాలోని కహ్రామా అవేర్నెస్ పార్క్లో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) యజమానులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. ఖతార్లో EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల భవిష్యత్తు గురించి చర్చించారు.
ఈ కార్యక్రమంలో కహ్రామాలోని పరిరక్షణ, ఇంధన సామర్థ్య విభాగం డైరెక్టర్ రషీద్ హుస్సేన్ అల్-రహిమి మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా 300 కి పైగా వేగవంతమైన EV ఛార్జర్లను వ్యూహాత్మకంగా ఇన్స్టాల్ చేసినట్టు వెల్లడించారు.ఈ ఛార్జర్లు పెరుగుతున్న EV వినియోగదారులకు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.కస్టమర్ల ఛార్జింగ్ పురోగతిని ట్రాక్ చేయడానికి, నోటిఫికేషన్లను స్వీకరించడానికి, రియల్ టైమ్ డేటాను యాక్సెస్ చేయడానికి కహ్రామ EV ఛార్జింగ్ మొబైల్ అప్లికేషన్ను తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









