సెమీస్ కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, తరుణ్..
- August 02, 2025
మకావ్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, తరుణ్ మన్నేపల్లి సెమీఫైనల్స్ చేరగా, డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ నిష్క్రమించింది.
- కామన్వెల్త్ గేమ్స్ విజేత లక్ష్య సేన్ ఈ సంవత్సరంలో తొలిసారి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్కు అర్హత సాధించాడు.చైనాకు చెందిన జూ షుయాన్ చెన్ను 21-14, 18-21, 21-14 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్ సుమారు ఒక గంట మూడు నిమిషాల పాటు సాగింది.
- తరుణ్ మన్నేపల్లి కూడా అద్భుత ప్రదర్శనతో తన తొలి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. చైనా ఆటగాడు హూ జె అన్నపై 21-12, 13-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. ఈ పోరు ఒక గంట 15 నిమిషాల పాటు జరిగింది.
- సెమీ ఫైనల్స్లో లక్ష్య సేన్ ఇండోనేషియా క్రీడాకారుడు ఆల్వీ ఫర్హాన్ను, తరుణ్ మలేషియాకు చెందిన జస్టిన్ హోను ఎదుర్కొనబోతున్నారు.
- మరోవైపు, ప్రపంచ మాజీ నంబర్ వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. మలేషియా జంట చూం హాన్ జియాన్–ముహమ్మద్ హైకల్ చేతిలో 14-21, 21-13, 22-20 తేడాతో ఓటమి చవిచూశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







