ఖతార్లో ఈ వారం హ్యూమిడిటీ స్థాయిలు మరింత పెరిగే అవకాశం
- August 03, 2025
దోహా: ఖతార్ వాతావరణ శాఖ (QMD) ఆగస్టు 3, ఆదివారం నాడు వెల్లడించిన ప్రకారం, దేశవ్యాప్తంగా హ్యూమిడిటీ స్థాయిలు ఈ వారం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ వారం మంగళవారం (ఆగస్టు 5) నుంచి బుధవారం (ఆగస్టు 6) వరకు హ్యూమిడిటీ స్థాయిలు గణనీయంగా పెరగనున్నాయని శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు లేదా మిస్టు ఏర్పడే అవకాశముంది.
ప్రస్తుతం ఖతార్ గ్రీష్మ కాలంలో మూడవ నెలలోకి ప్రవేశించింది. ఈ సమయంలో దేశమంతటా అధిక ఉష్ణోగ్రతలు మరియు తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. వర్ష పాతం నమోదయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది.
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, ఆగస్టు నెలలో భూమి ఉపరితలంపై తక్కువ ఒత్తిడితో కూడిన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల హ్యూమిడిటీ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ కాలంలో వాయువులు ప్రధానంగా తూర్పు దిశగా వీచే అవకాశం ఉండడంతో హ్యూమిడిటీ మరింత పెరుగుతుంది.
ఇప్పటివరకు ఖతార్లో ఆగస్టు నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 48.6 డిగ్రీల సెల్సియస్ (2002లో) కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.4 డిగ్రీల సెల్సియస్ (1971లో) గా నమోదైంది.
ఈ నెలలో రోజువారీ సగటు ఉష్ణోగ్రత సుమారు 35 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రజలు అధిక ఉష్ణోగ్రతలు మరియు తేమ పరిస్థితుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు పాటించాలని శాఖ సూచించింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









