ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..
- August 04, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సతీమణి ఉపాసనకు కీలక బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్కు కో-ఛైర్మన్గా ఉపాసనను నియమించింది. తనకు ఈ బాధ్యతలను అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కొత్తగా క్రీడా పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ కు ప్రభుత్వం పెద్ద పీఠ వేసింది. ఇందులో భాగంగా క్రీడారంగాల్ని ప్రోత్సాహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవాళ్లతో ఓ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ని నియమించింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్సజ్ ఓనర్ అయిన సంజీవ్ గొయెంకాను దీనికి ఛైర్మన్గా నియమించారు. కో-ఛైర్మన్గా ఉపాసనను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఉపాసన ధన్యవాదాలు తెలియజేశారు. సంజీవ్ గొయెంకాతో కలిసి పని చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను ప్రభుత్వం నియమించింది.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







