చైనా పర్యటనకు ప్రధాని మోదీ
- August 06, 2025
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు.అక్కడ టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఇక చైనా పర్యటన అనంతరం ప్రధాని మోదీ అట్నుంచిఅటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటకు వెళ్తుండటం ఇదే తొలిసారి. మరోవైపు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సదస్సు ద్వారా భారత-చైనా సంబంధాలు పునరుద్ధరించడానికి, రెండు దేశాల మధ్య వాణిజ్యం, భద్రతా చర్చలు, ప్రాంతీయ సమస్యలపై సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయని భావిస్తున్నారు. చైనా పర్యటన అనంతరం, మోదీ జపాన్కు కూడా పర్యటనకు వెళ్ళే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై రష్యా చమురు దిగుమతులపై అదనపు సుంకాలు విధించనున్నట్టు హెచ్చరించిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల్లో సక్రమంగా వ్యూహాత్మక బహుళ సంబంధాలు నెలకొల్పడంలో తను మోదీ పాత్ర కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ పర్యటన భారత విదేశీ విధానంలో ఒక కీలక మలుపుగా భావిస్తుండగా, చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, రెండు పక్కల సంభాషణను కొనసాగించడం ద్వారా స్ధిరత్వాన్ని సృష్టించడానికి దీని ప్రయోజనాలు ఉండవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









