షార్జా మహిళ ఆత్మహత్య: కేరళ విమానాశ్రయంలో భర్త అరెస్టు..!!
- August 10, 2025
షార్జా: ఆత్మహత్య చేసుకుని మరణించిన 30 ఏళ్ల షార్జా ప్రవాసురాలు అతుల్య శేఖర్ భర్తను తిరువనంతపురంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం దుబాయ్ నుండి విమానంలో కేరళ రాజధానిలో దిగిన నలభై ఏళ్ల సతీష్ శంకర్ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
కాగా, సతీష్ జిల్లా కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందాడని, అతని వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బట్టి బెయిల్పై విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.
అతుల్య కుటుంబం ఆమె భర్తపై శారీరక వేధింపులు, వరకట్న సంబంధిత నేరాల కింద కేసు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు, ఆమె భర్త ఆమెను శారీరకంగా వేధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూలై 19న ఆమె మరణించిన వారం తర్వాత, షార్జా పోలీసులు ఆమె ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. అతుల్య మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తరలించగా , ఆమె కుమార్తె అంత్యక్రియలు దుబాయ్లోని సోనాపూర్ న్యూ స్మశానవాటికలో జరిగాయి.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









