షార్జా మహిళ ఆత్మహత్య: కేరళ విమానాశ్రయంలో భర్త అరెస్టు..!!
- August 10, 2025
షార్జా: ఆత్మహత్య చేసుకుని మరణించిన 30 ఏళ్ల షార్జా ప్రవాసురాలు అతుల్య శేఖర్ భర్తను తిరువనంతపురంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం దుబాయ్ నుండి విమానంలో కేరళ రాజధానిలో దిగిన నలభై ఏళ్ల సతీష్ శంకర్ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
కాగా, సతీష్ జిల్లా కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందాడని, అతని వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బట్టి బెయిల్పై విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.
అతుల్య కుటుంబం ఆమె భర్తపై శారీరక వేధింపులు, వరకట్న సంబంధిత నేరాల కింద కేసు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు, ఆమె భర్త ఆమెను శారీరకంగా వేధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూలై 19న ఆమె మరణించిన వారం తర్వాత, షార్జా పోలీసులు ఆమె ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. అతుల్య మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తరలించగా , ఆమె కుమార్తె అంత్యక్రియలు దుబాయ్లోని సోనాపూర్ న్యూ స్మశానవాటికలో జరిగాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







