'పల్ పల్ దిల్ కే పాస్' –కిశోర్ కుమార్ జయంతి వేడుకల్లో మధుర గాన మాలిక
- August 10, 2025
హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ కృష్ణ స్వర రాగ స్రవంతి ఆధ్వర్యంలో, అంతర్జాతీయ బహుభాషా, బహుగళ స్వర నిధి వై.ఎస్. రామకృష్ణ నిర్వహణలో, గంధర్వ గాయకుడు కిశోర్ కుమార్ 96వ జయంతి సందర్భంగా విశేష సంగీత కార్యక్రమం జరిగింది. “పల్ పల్ దిల్ కే పాస్” అనే శీర్షికతో నిర్వహించిన ఈ ప్రత్యేక గానసభ, శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన మందిరంలో జంట నగరాల ప్రముఖ గాయనీ-గాయకులతో ఘనంగా జరిగింది.
ఈ సభకు విశ్రాంత డైరెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, తెలంగాణ ప్రభుత్వం బి. రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, “కిశోర్ కుమార్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన స్వరం ఎప్పటికీ మధురంగా, అమరంగా నిలుస్తుంది” అని ప్రశంసించారు. కళాబ్రహ్మ, శిరోమణి వంశీ రామరాజు మాట్లాడుతూ, “ఇంత అందమైన గాన కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహించడం హర్షణీయం” అని అన్నారు.
కార్యక్రమంలో రామకృష్ణ మరియు వారి బృందం, కిశోర్ కుమార్ పాడిన ఏకగళ, ద్విగళ గీతాలు — ప్యార్ కా డర్డ్ హై, ఓ సాతీ రే, జై జై శివ్ శంకర్, కొరా కాగజ్ థా, మేరే సప్నోన్ కి రాణి — వంటి మధుర గీతాలను ఆహ్లాదకరంగా ఆలపించి శ్రోతలను అలరించారు.
ఈ గానసంధ్యలో వై.ఎస్. రామకృష్ణ, గంటి రామకృష్ణ, కశ్యప్, కే.వి. రావు, దేవకృష్ణ, రామసుబ్రహ్మణ్యం, రాజగోపాల్, లలిత, మధుర వీణ, గంటి శైలజ, ఆరతి, అనిత తమ గాత్రాన్ని అందించారు. ఎన్. లలిత హిందీ వ్యాఖ్యానం అద్భుతంగా సమర్పించి కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







