'పల్ పల్ దిల్ కే పాస్' –కిశోర్ కుమార్ జయంతి వేడుకల్లో మధుర గాన మాలిక
- August 10, 2025
హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ కృష్ణ స్వర రాగ స్రవంతి ఆధ్వర్యంలో, అంతర్జాతీయ బహుభాషా, బహుగళ స్వర నిధి వై.ఎస్. రామకృష్ణ నిర్వహణలో, గంధర్వ గాయకుడు కిశోర్ కుమార్ 96వ జయంతి సందర్భంగా విశేష సంగీత కార్యక్రమం జరిగింది. “పల్ పల్ దిల్ కే పాస్” అనే శీర్షికతో నిర్వహించిన ఈ ప్రత్యేక గానసభ, శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన మందిరంలో జంట నగరాల ప్రముఖ గాయనీ-గాయకులతో ఘనంగా జరిగింది.
ఈ సభకు విశ్రాంత డైరెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, తెలంగాణ ప్రభుత్వం బి. రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, “కిశోర్ కుమార్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన స్వరం ఎప్పటికీ మధురంగా, అమరంగా నిలుస్తుంది” అని ప్రశంసించారు. కళాబ్రహ్మ, శిరోమణి వంశీ రామరాజు మాట్లాడుతూ, “ఇంత అందమైన గాన కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహించడం హర్షణీయం” అని అన్నారు.
కార్యక్రమంలో రామకృష్ణ మరియు వారి బృందం, కిశోర్ కుమార్ పాడిన ఏకగళ, ద్విగళ గీతాలు — ప్యార్ కా డర్డ్ హై, ఓ సాతీ రే, జై జై శివ్ శంకర్, కొరా కాగజ్ థా, మేరే సప్నోన్ కి రాణి — వంటి మధుర గీతాలను ఆహ్లాదకరంగా ఆలపించి శ్రోతలను అలరించారు.
ఈ గానసంధ్యలో వై.ఎస్. రామకృష్ణ, గంటి రామకృష్ణ, కశ్యప్, కే.వి. రావు, దేవకృష్ణ, రామసుబ్రహ్మణ్యం, రాజగోపాల్, లలిత, మధుర వీణ, గంటి శైలజ, ఆరతి, అనిత తమ గాత్రాన్ని అందించారు. ఎన్. లలిత హిందీ వ్యాఖ్యానం అద్భుతంగా సమర్పించి కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







