'పల్ పల్ దిల్ కే పాస్' –కిశోర్ కుమార్ జయంతి వేడుకల్లో మధుర గాన మాలిక
- August 10, 2025
హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ కృష్ణ స్వర రాగ స్రవంతి ఆధ్వర్యంలో, అంతర్జాతీయ బహుభాషా, బహుగళ స్వర నిధి వై.ఎస్. రామకృష్ణ నిర్వహణలో, గంధర్వ గాయకుడు కిశోర్ కుమార్ 96వ జయంతి సందర్భంగా విశేష సంగీత కార్యక్రమం జరిగింది. “పల్ పల్ దిల్ కే పాస్” అనే శీర్షికతో నిర్వహించిన ఈ ప్రత్యేక గానసభ, శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన మందిరంలో జంట నగరాల ప్రముఖ గాయనీ-గాయకులతో ఘనంగా జరిగింది.
ఈ సభకు విశ్రాంత డైరెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, తెలంగాణ ప్రభుత్వం బి. రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, “కిశోర్ కుమార్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన స్వరం ఎప్పటికీ మధురంగా, అమరంగా నిలుస్తుంది” అని ప్రశంసించారు. కళాబ్రహ్మ, శిరోమణి వంశీ రామరాజు మాట్లాడుతూ, “ఇంత అందమైన గాన కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహించడం హర్షణీయం” అని అన్నారు.
కార్యక్రమంలో రామకృష్ణ మరియు వారి బృందం, కిశోర్ కుమార్ పాడిన ఏకగళ, ద్విగళ గీతాలు — ప్యార్ కా డర్డ్ హై, ఓ సాతీ రే, జై జై శివ్ శంకర్, కొరా కాగజ్ థా, మేరే సప్నోన్ కి రాణి — వంటి మధుర గీతాలను ఆహ్లాదకరంగా ఆలపించి శ్రోతలను అలరించారు.
ఈ గానసంధ్యలో వై.ఎస్. రామకృష్ణ, గంటి రామకృష్ణ, కశ్యప్, కే.వి. రావు, దేవకృష్ణ, రామసుబ్రహ్మణ్యం, రాజగోపాల్, లలిత, మధుర వీణ, గంటి శైలజ, ఆరతి, అనిత తమ గాత్రాన్ని అందించారు. ఎన్. లలిత హిందీ వ్యాఖ్యానం అద్భుతంగా సమర్పించి కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









