కువైట్ లో టెలికాం టవర్లు, బ్యాంకులే లక్ష్యంగా సైబర్ అటాక్స్..!!
- August 11, 2025
కువైట్ః కువైట్ లో భారీ సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్న ముఠా నెట్ వర్క్ ను అధికారులు ఛేదించారు. టెలికాం టవర్లు, బ్యాంకులపై దాడులకు పాల్పడిన ఆఫ్రికన్ జాతీయతకు చెందిన అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైబర్ క్రైమ్ ముఠా నెట్వర్క్లను హ్యాక్ చేయడానికి మరియు బ్యాంక్ అకౌంట్ల నుంచి నిధులను దొంగిలించడానికి బ్యాంకు సిబ్బంది పేరిట ఫేక్ మెసేజులు, కాల్స్ చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇందు కోసం ముఠా అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. రైడ్స్ సందర్భంగా వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు, సాల్మియాలో ఒక వాహనం నుండి అనుమానాస్పద సంకేతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించి, అనేక కార్లను ఢీకొట్టాడు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







