హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. బయటకు రావొద్దు..
- August 11, 2025
హైదరాబాద్ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. నాలుగు రోజులుగా సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడి కుండపోత వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంకుతోడు ఈదురుగాలులు తోడవుతుండటంతో చెట్లు విరిగి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే, ఇవాళ కూడా హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టనుంది. మధ్యాహ్నం తరువాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందట.
హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.. మధ్యాహ్నం తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
మధ్యాహ్నం తరువాత అంటే.. 2గంటల తరువాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వర్షం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో 25 నుంచి 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, హన్మకొండ, భద్రాద్రి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్లో సాయంత్రం వేళ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్