ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- October 12, 2025
కువైట్: కువైట్ కాపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 7,658 నోటీసులు జారీ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 594 కేసులు ఓవర్టేక్, ఇతర వాహనాలను అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది.
ఇక రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 17 మందితోపాటు 11 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అన్ని గవర్నరేట్లలో ఈ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. తల్లిదండ్రులు తమ పిల్లలలో ట్రాఫిక్ అవగాహనను పెంచాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకాన్ని నివారించాలని కోరింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







