ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- October 12, 2025
కువైట్: కువైట్ కాపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 7,658 నోటీసులు జారీ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 594 కేసులు ఓవర్టేక్, ఇతర వాహనాలను అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది.
ఇక రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 17 మందితోపాటు 11 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అన్ని గవర్నరేట్లలో ఈ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. తల్లిదండ్రులు తమ పిల్లలలో ట్రాఫిక్ అవగాహనను పెంచాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకాన్ని నివారించాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!







