ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- October 12, 2025
మనామా: ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ విభాగంలో బహ్రెయిన్ ల సంఖ్యలను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అదే సమయంలో అరబిక్, ఇస్లామిక్ విద్య మరియు సామాజిక అధ్యయనాలలో లోకలైజేషన్ కు మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను బహ్రెయిన్ పునరుద్ఘాటించింది.
విదేశీ కార్మికుల అనుమతుల నుండి వసూలు చేస్తున్న 80% రుసుములను తమ్కీన్ లేబర్ ఫండ్ ద్వారా ప్రైవేట్ రంగంలో బహ్రెయిన్ ఉపాధిని పెంచడానికి, పౌరులకు కొత్త అవకాశాలను సృష్టించడానికి ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విద్యాపరంగా మరియు వృత్తిపరంగా అర్హత కలిగిన బహ్రెయిన్ విద్యావేత్తలను ఆకర్షించడానికి అధికారులు చురుకుగా పనిచేస్తున్నాని తెలిపింది. ప్రైవేట్ స్కూళ్లలో అర్హత కలిగిన స్థానిక ఉపాధ్యాయులకు ప్రాధాన్యతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
ఇందులో భాగంగా బహ్రెయిన్ టీచర్స్ కాలేజ్ నుంచి ప్రొఫెషనల్ టీచింగ్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇది ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే బహ్రెయిన్ల సంఖ్యను గణనీయంగా పెంచిందన్నారు. విద్యతో సహా ప్రైవేట్ రంగ కార్యకలాపాలలో తప్పనిసరిగా స్థానికీకరణ కోటాను పూర్తి చేయాలని, లేదంటే అదనంగా ఉన్న ప్రతి విదేశీ కార్మికుడికి 500 బహ్రెయిన్ దినార్ల అదనపు రుసుమును ఎదుర్కొంటారని ఈ సందర్భంగా అధికార యంత్రాంగం హెచ్చరించింది.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









