మోసపూరిత OTP ల పట్ల కువైట్ హెచ్చరిక..!!

- August 12, 2025 , by Maagulf
మోసపూరిత OTP ల పట్ల కువైట్ హెచ్చరిక..!!

దోహా: ఖతార్ సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఇటీవల పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత మరియు రహస్య సమాచారాన్ని పొందడానికి మోసపూరిత ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాణిజ్య  పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) పౌరులు నివాసితులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌వర్డ్‌లు లేదా ఓటీపీలు వంటి డేటాను ఎప్పుడూ షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.అదే సమయంలో అనుమానాస్పద కాల్‌లు, మెసేజులు, ఇమెయిల్‌లను క్లిక్ చేయవద్దని తెలిపింది.  ఏవైనా సందేహాస్పద వివరాలను 16001 నంబర్ లో మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్‌ ను సంప్రదించాలని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com