ఆగస్టు 31న GCC ఫోరం ఫర్ గ్రీన్ మొబిలిటీ ప్రారంభం..!!
- August 13, 2025
సలాలా: GCC ఫోరం ఫర్ గ్రీన్ మొబిలిటీ 2025 ఆగస్టు 31న దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లో ప్రారంభమవుతుంది. రవాణా రంగంలో పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు ప్రత్యామ్నాయ రవాణా విధానాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఫోరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జీసీసీ దేశాల నుంచి వాహన రంగ నిపుణులు పాల్గొంటారు. రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడే కీలక విధానాలపై చర్చిస్తారు.
ముఖ్యంగా సలాలాలోని సుల్తాన్ ఖబూస్ యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్లో జరిగే "గల్ఫ్ యూత్ లీడ్ చేంజ్" వర్క్షాప్ మరియు "గ్రీన్ కారిడార్స్ ఫర్ గల్ఫ్ పోర్ట్స్" వర్క్షాప్ లు జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రీన్ ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ఆగస్టు 15-16 తేదీలలో పిల్లలకు పర్యావరణ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







