ఒమన్లో 8 మిలియన్లకు చేరుకున్న మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- August 17, 2025
మస్కట్: ఒమన్లో మొత్తం మొబైల్ టెలికాం సబ్స్క్రిప్షన్ల సంఖ్య జూన్ చివరి నాటికి 8 మిలియన్లు దాటింది. గతేడాదితో పోలిస్తే ఇది 15.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. జూన్ 2025 చివరి నాటికి యాక్టివ్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య 5,516,530కి పెరిగిందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తాజా లెక్కులు చెప్పాయి.
అదే సమయంలో యాక్టివ్ పోస్ట్పెయిడ్ మొబైల్ సబ్స్క్రిప్షన్లు 5.3 శాతం పెరిగి 1,236,561కి చేరుకున్నాయి. యాక్టివ్ ప్రీపెయిడ్ మొబైల్ సబ్స్క్రిప్షన్లు కూడా 3.6 శాతం పెరిగి 5,236,191 సబ్స్క్రిప్షన్లకు చేరుకున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సబ్స్క్రిప్షన్లు 118.6 శాతంతో అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. జూన్ 2025 చివరి నాటికి 1,560,256 సబ్స్క్రిప్షన్లకు చేరుకున్నాయి.
మరోవైపు యాక్టివ్ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రిప్షన్లు 2.2 శాతం పెరిగి, 588,477 సబ్స్క్రిప్షన్లకు చేరుకున్నాయి. ఫైబర్ ఆప్టిక్ సబ్స్క్రిప్షన్లు 10.3 శాతం పెరిగి, 339,309 సబ్స్క్రిప్షన్లకు చేరుకున్నాయి. అయితే ఫిక్స్డ్ 5G సబ్స్క్రిప్షన్లు 1.5 శాతం పెరిగి 215,434 కు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









