బహ్రెయిన్ శిక్షాస్మృతిలో సవరణలు..పెరిగిన జైలుశిక్ష, ఫైన్స్..!!
- August 20, 2025
మానామా: బహ్రెయిన్ శిక్షాస్మృతికి కీలక సవరణలను చేస్తూ.. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఉత్తర్వులు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహారించి మరణానికి లేదా శారీరక హాని కలిగించే సంఘటనలపై ఇకపై కఠినమైన శిక్షలు విధించనున్నారు.
సవరించిన ఆర్టికల్ 342 ప్రకారం నిర్లక్ష్యం మరొక వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. శిక్షల్లో భాగంగా 2 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2,000 నుండి 6,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానాలు ఉన్నాయి.
వృత్తిపరమైన నిర్లక్ష్యం, బాధితుడికి సహాయం చేయడంలో వైఫల్యం వల్ల మరణం పెరిగిన సందర్భంలో శిక్షలు పెరుగుతాయి.
మరణాలు పెరిగితే.. జైలు శిక్ష 7 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 10,000 దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది. కేసు తీవ్రతను బట్టి జైలుశిక్ష 10 సంవత్సరాలకు పెరగవచ్చు.
ఈ ఆర్టికల్ కింద ఉన్న కేసులను హై క్రిమినల్ కోర్టు విచారిస్తుంది. అప్పీళ్లను సుప్రీం క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ పరిధిలోకి వస్తాయి.
అదేవిధంగా శారీరక హాని కలిగించేలా వ్యవహారించే వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా 200 దినార్ల వరకు జరిమానా విధించవచ్చని ఇప్పుడు ఆర్టికల్ 343 నిర్దేశిస్తుంది.
వృత్తిపరమైన నిర్లక్ష్యం, సహాయం అందించడంలో వైఫల్యం వల్ల శాశ్వత గాయం లేదా హాని జరిగితే 1 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 8,000 దినార్ల వరకు జరిమానా విధించవచ్చు. మృతుల సంఖ్య ఆధారంగా 2 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షలను పెంచుతారు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







