బహ్రెయిన్ శిక్షాస్మృతిలో సవరణలు..పెరిగిన జైలుశిక్ష, ఫైన్స్..!!
- August 20, 2025
మానామా: బహ్రెయిన్ శిక్షాస్మృతికి కీలక సవరణలను చేస్తూ.. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఉత్తర్వులు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహారించి మరణానికి లేదా శారీరక హాని కలిగించే సంఘటనలపై ఇకపై కఠినమైన శిక్షలు విధించనున్నారు.
సవరించిన ఆర్టికల్ 342 ప్రకారం నిర్లక్ష్యం మరొక వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. శిక్షల్లో భాగంగా 2 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2,000 నుండి 6,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానాలు ఉన్నాయి.
వృత్తిపరమైన నిర్లక్ష్యం, బాధితుడికి సహాయం చేయడంలో వైఫల్యం వల్ల మరణం పెరిగిన సందర్భంలో శిక్షలు పెరుగుతాయి.
మరణాలు పెరిగితే.. జైలు శిక్ష 7 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 10,000 దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది. కేసు తీవ్రతను బట్టి జైలుశిక్ష 10 సంవత్సరాలకు పెరగవచ్చు.
ఈ ఆర్టికల్ కింద ఉన్న కేసులను హై క్రిమినల్ కోర్టు విచారిస్తుంది. అప్పీళ్లను సుప్రీం క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ పరిధిలోకి వస్తాయి.
అదేవిధంగా శారీరక హాని కలిగించేలా వ్యవహారించే వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా 200 దినార్ల వరకు జరిమానా విధించవచ్చని ఇప్పుడు ఆర్టికల్ 343 నిర్దేశిస్తుంది.
వృత్తిపరమైన నిర్లక్ష్యం, సహాయం అందించడంలో వైఫల్యం వల్ల శాశ్వత గాయం లేదా హాని జరిగితే 1 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 8,000 దినార్ల వరకు జరిమానా విధించవచ్చు. మృతుల సంఖ్య ఆధారంగా 2 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షలను పెంచుతారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







