ఫిల్మ్ ఛాంబర్ సమస్యలను చర్చించి పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ ఆదేశం
- August 20, 2025
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద సంక్షోభం నెలకొంది. ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపుతో 17 రోజులుగా కొనసాగుతోన్న సమ్మె కారణంగా అన్ని షూటింగులు పూర్తిగా ఆగిపోయాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి సినిమా ప్రాజెక్ట్ నిలిచిపోవడం వల్ల నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమ్మె వెనుక ప్రధాన కారణం వేతనాల పెంపు. కార్మికులు తమ వేతనాలను 30 శాతం మేర పెంచాలని పట్టుబడుతుండగా, ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు ఆ డిమాండ్ను నెరవేర్చడం సాధ్యం కాదని చెబుతున్నారు.ఇప్పటికే పలుమార్లు ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు సమావేశమైనా ఎటువంటి పరిష్కారం దొరకలేదు. ప్రతి చర్చా విఫలమవుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి మధ్యవర్తిత్వం చేసినా ఎటువంటి ఫలితం రాలేదు. సమ్మె విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఇరుపక్షాల మధ్య దూరం మరింత పెరిగింది.
పరిశ్రమలో సీనియర్లు “ఇలాంటి సమయంలో దాసరి నారాయణరావు లాంటి నేతృత్వం ఉంటే సమస్యలు సులభంగా పరిష్కరమయ్యేవి” అని వ్యాఖ్యానిస్తున్నారు.ఇకపోతే సమ్మె కారణంగా నిర్మాతలకు మాత్రమే కాకుండా, కొత్తగా షూటింగ్కి సిద్ధమైన చిన్న సినిమాలకు, సీరియల్స్కూ నష్టం కలుగుతోంది. వందలాది మంది చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, డైలీ వేజ్ వర్కర్స్ నిరుద్యోగులుగా మారారు. రోజువారీ ఆదాయంపై బతికే కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.అసలు ఈ సమ్మె ఎన్నాళ్లు కొనసాగుతుంది.. పరిష్కారం దొరుకుతుందాం.. లేదా అన్న సందిగ్థత నెలకొన్న వేళ తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశించారు. గత రెండు వారాలుగా కొనసాగుతోన్న ఈ సమ్మె రాష్ట్ర సినిమా పాలసీపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ని సినిమా హబ్గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె పెద్ద అడ్డంకిగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







