టీమిండియాకు మేనేజర్గా ఏపీకి చెందిన ప్రశాంత్
- August 21, 2025
భారత క్రికెట్ టీమ్ కు మరోసారి తెలుగువారి ప్రతిభ చాటుకుంది.ఆంధ్రప్రదేశ్కు చెందిన పీవీఆర్ ప్రశాంత్ టీమిండియా మేనేజర్గా ఎంపికయ్యారు.ఇది తెలుగు అభిమానులకు గర్వకారణం.ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, ప్రస్తుతం క్రికెట్ పరంగా ప్రముఖ బాధ్యత స్వీకరించారు. ఆయన భీమవరానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. టీమిండియా మేనేజర్గా ఆసియా కప్కి ఆయన వెళ్లనున్నారు.సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. దుబాయ్, అబుదాబి వేదికలు ఈ మెగా ఈవెంట్కు సిద్ధమవుతున్నాయి. భారత జట్టు మేనేజ్మెంట్ బాధ్యతలు ప్రశాంత్కు అప్పగించారు.
ఈ ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక పాల్గొంటున్నాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, ఒమన్, యూఏఈ జట్లు కూడా ఉన్నాయి. ప్రతి మ్యాచ్కి ప్రత్యేక ఉత్కంఠ నెలకొననుంది.ఇప్పటి మేనేజర్ ప్రశాంత్ గతంలో క్రికెటర్గానే జీవితం ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ అనుభవం ఆయనకు ఇప్పుడు మేలు చేసింది.ప్రశాంత్ సుపరిచిత రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి పులపర్తి రామాంజనేయులు భీమవరం ఎమ్మెల్యే. అంతేకాదు, పీఏసీ చైర్మన్గా కూడా సేవలందించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









