మహిళా కమిషన్ సభ్యులుగా పీవీ సింధు, మహేశ్భగవత్
- August 21, 2025
హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్ (NCW) సలహా కమిటీ-2025 సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్లు నియమితులయ్యారు.ఈ నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల అయింది.మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై కమిషన్కు సలహాలు, సూచనలు ఇవ్వడం ఈ సలహా కమిటీ ప్రధాన విధి. పీవీ సింధు క్రీడాకారిణిగా ఆమె దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు. ఆమె మహిళా సాధికారతకు ఒక చిహ్నంగా నిలిచారు. మహేశ్ భగవత్ ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో మహిళల భద్రత కోసం, ముఖ్యంగా మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆయన చేసిన కృషికి గాను విశేష గుర్తింపు పొందారు. వీరి నియామకం వల్ల మహిళా కమిషన్కు వారి అనుభవం, నిపుణత ఎంతగానో ఉపయోగపడతాయని కమిషన్ భావిస్తోంది. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం 21 మందిని సభ్యులుగా నియమించారు. ఇందులో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి, ఫిక్కి ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్కూ ఇందులో స్థానం కల్పించారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









