12నెలల్లో దాదాపు 800 కారు అగ్నిప్రమాదలు..!!
- August 25, 2025
pic for illustrative purpose only..
మనామా: బహ్రెయిన్ లో కారులో అగ్నిప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కారు ప్రమాదాలను సీరియస్ గా తీసుకోవాలని, భద్రతపరమైన చర్యలు చేపట్టాలని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.
బహ్రెయిన్లో కేవలం ఒక సంవత్సరంలో దాదాపు 800 కార్ల అగ్నిప్రమాదాలు నమోదయ్యాయని డిజిటల్ ప్లాట్ఫామ్లలో మంత్రిత్వ శాఖ అమన్ ప్రోగ్రామ్ తాజా ఎపిసోడ్లో కల్నల్ ఒసామా బహార్ వెల్లడించారు. సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం చేయడమే ఈ మంటలకు ప్రధాన కారణాలు అని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఇంధన లీకేజీలు మంటలు చెలరేగడానికి సరైన పరిస్థితులను కల్పిస్తాయని చెప్పారు.
అలాగే, కార్ల లోపల పెర్ఫ్యూమ్లు, గ్యాస్ క్యానిస్టర్లు, క్యాంపింగ్ పరికరాలు లేదా పవర్ బ్యాంక్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పెట్టవద్దని కల్నల్ బహార్ హెచ్చరించారు. అవి తీవ్రమైన వేడిలో మండటం లేదా పేలిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయని అన్నారు.
మంటలు చెలరేగి వాహనాన్ని పూర్తిగా కాల్చివేయడానికి దాదాపు 20 నిమిషాలు మాత్రమే పడుతుందని తెలిపారు. BD 8 లభించే చిన్న అగ్నిమాపక యంత్రంతో తొలి కొన్ని నిమిషాల్లో త్వరగా చర్య తీసుకోవడం వల్ల తీవ్రమైన నష్టాన్ని నివారించడం ద్వారా ణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
డ్రైవర్లు ప్రమాద సంకేతాలను తీవ్రంగా పరిగణించాలని, ప్రాథమిక భద్రతా సాధనాలను, ముఖ్యంగా అగ్నిమాపక యంత్రాన్ని తమ వాహనాల లోపల పెట్టుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు