షిర్డీ లో వైభవంగా నిర్వహించిన 'గురు పౌర్ణిమ' వేడుకలు

- July 18, 2016 , by Maagulf
షిర్డీ లో వైభవంగా నిర్వహించిన 'గురు పౌర్ణిమ' వేడుకలు

 మహారాష్ట్రలోని షిర్డీలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి సాయినాథుని దర్శించుకుంటున్నారు. దీంతో వేకువ జాము నుంచే షిర్డీ భక్త జనసంద్రంగా మారింది. గురువే ప్రత్యక్ష దైవమని చెప్పే గొప్ప వేడుక గురుపౌర్ణమి. వ్యాస పౌర్ణమినే.. గురుపౌర్ణమిగా ఆచరించాలని సాయినాథుడు ఆదేశించినట్లు భక్తుల విశ్వాసం. 
తెలుగు రాష్ట్రాల్లో... 
గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌ సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లోని ఆలయాలు సాయినామస్మరణతో మార్మోగుతున్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com