సబ్జాతో ఎంతో ఆరోగ్యం
- July 16, 2015
వేసవి వచ్చిందంటే అనేక రకాల పళ్లు, కొబ్బరిబొండాలు, చల్లని పానీయాలు తాగుతుంటాం. పుదీనా జ్యూస్, లెమన్ జ్యూస్, గ్లూకోజ్ వాటర్ ఇలా చాలా రకాల శీతల పానీయాలు మన ఇంట్లో చేసుకున్నవి తాగుతుంటాం. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది కేవలం సమ్మర్లో మాత్రమే కాకుండా మిగతా అన్ని కాలాల్లో కూడా తీసుకోవల్సింది సబ్జాగింజలతో చేసిన ఏ ఐటం అయినా సరే. సబ్జాగింజల్ని నీళ్లలో నానబెట్టి దానికి నిమ్మరసం, పంచదార కలిపి తీసుకునే పానీయం వేసవిలో దాహార్తిని తీర్చి శరీరానికి చాలా శక్తినిస్తుంది. సజ్జాగింజల్లో విటమిన్లూ, ఐరన్, పోషకాలూ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి అందడమే కాక రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సబ్జా గింజలను నీళ్లలో నాలుగైదు గంటలు నానబెట్టి తరువాత ఆ నీటిని పారబోసి, పాలలో వేసుకుని, కొద్దిగా వెనిల్లా కలిపి తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి మంచి మందుగా ఉపయోగపడుతుంది. అంతే కాదు సబ్జా గింజలను తరచూ తీసుకునేవారికి కడుపుబ్బరం, గుండెల్లో మంటలాంటి సమస్యలు తగ్గుతాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









