హాంగ్ కాంగ్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
- September 08, 2025
హాంగ్కాంగ్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ది హాంగ్కాంగ్ తెలుగు సమాఖ్య, గిడుగు రామమూర్తి పంతులు జయంతిని తెలుగు సాంస్కృతిక ఉత్సవంగా ఘనంగా నిర్వహించింది.
తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు రామమూర్తి సేవలను స్మరించుకుంటూ, స్థాపక సభ్యురాలు జయ పీసపాటి తెలుగు భాషా ప్రాముఖ్యతను, దానిని నేర్చుకోవడంలో ఉన్న అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో పిల్లలు తెలుగు భాష, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా క్లాసికల్, సెమీ క్లాసికల్, జానపద, టాలీవుడ్ పాటలతో నృత్యాలు ప్రదర్శించారు. అదనంగా కవితా పఠనం, కథా విన్యాసాలు, చిత్రకళా పోటీలు నిర్వహించబడ్డాయి.
ప్రతి ఏడాది ఈ వేడుకను ప్రత్యేకంగా పిల్లల అభిరుచులు, కళలను ప్రోత్సహించే వేదికగా నిర్వహిస్తున్నామని, దాదాపు రెండు దశాబ్దాలుగా వారాంతాల్లో తెలుగు తరగతులను నిర్వహిస్తూ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు జయ పీసపాటి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను అభినందిస్తూ, తెలుగు నేర్చుకోవడంలో చూపిస్తున్న ఆసక్తికి ప్రత్యేకంగా ప్రశంసలు అందించారు.


తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









