హాంగ్ కాంగ్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
- September 08, 2025
హాంగ్కాంగ్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ది హాంగ్కాంగ్ తెలుగు సమాఖ్య, గిడుగు రామమూర్తి పంతులు జయంతిని తెలుగు సాంస్కృతిక ఉత్సవంగా ఘనంగా నిర్వహించింది.
తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు రామమూర్తి సేవలను స్మరించుకుంటూ, స్థాపక సభ్యురాలు జయ పీసపాటి తెలుగు భాషా ప్రాముఖ్యతను, దానిని నేర్చుకోవడంలో ఉన్న అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో పిల్లలు తెలుగు భాష, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా క్లాసికల్, సెమీ క్లాసికల్, జానపద, టాలీవుడ్ పాటలతో నృత్యాలు ప్రదర్శించారు. అదనంగా కవితా పఠనం, కథా విన్యాసాలు, చిత్రకళా పోటీలు నిర్వహించబడ్డాయి.
ప్రతి ఏడాది ఈ వేడుకను ప్రత్యేకంగా పిల్లల అభిరుచులు, కళలను ప్రోత్సహించే వేదికగా నిర్వహిస్తున్నామని, దాదాపు రెండు దశాబ్దాలుగా వారాంతాల్లో తెలుగు తరగతులను నిర్వహిస్తూ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు జయ పీసపాటి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను అభినందిస్తూ, తెలుగు నేర్చుకోవడంలో చూపిస్తున్న ఆసక్తికి ప్రత్యేకంగా ప్రశంసలు అందించారు.
తాజా వార్తలు
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
- నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్