హాంగ్ కాంగ్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
- September 08, 2025
హాంగ్కాంగ్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ది హాంగ్కాంగ్ తెలుగు సమాఖ్య, గిడుగు రామమూర్తి పంతులు జయంతిని తెలుగు సాంస్కృతిక ఉత్సవంగా ఘనంగా నిర్వహించింది.
తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు రామమూర్తి సేవలను స్మరించుకుంటూ, స్థాపక సభ్యురాలు జయ పీసపాటి తెలుగు భాషా ప్రాముఖ్యతను, దానిని నేర్చుకోవడంలో ఉన్న అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో పిల్లలు తెలుగు భాష, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా క్లాసికల్, సెమీ క్లాసికల్, జానపద, టాలీవుడ్ పాటలతో నృత్యాలు ప్రదర్శించారు. అదనంగా కవితా పఠనం, కథా విన్యాసాలు, చిత్రకళా పోటీలు నిర్వహించబడ్డాయి.
ప్రతి ఏడాది ఈ వేడుకను ప్రత్యేకంగా పిల్లల అభిరుచులు, కళలను ప్రోత్సహించే వేదికగా నిర్వహిస్తున్నామని, దాదాపు రెండు దశాబ్దాలుగా వారాంతాల్లో తెలుగు తరగతులను నిర్వహిస్తూ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు జయ పీసపాటి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను అభినందిస్తూ, తెలుగు నేర్చుకోవడంలో చూపిస్తున్న ఆసక్తికి ప్రత్యేకంగా ప్రశంసలు అందించారు.


తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









