భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- September 10, 2025
భారత ప్రధాని నా స్నేహితుడు.. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.. మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నా అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ ట్రూత్లో పోస్టు పెట్టారు. ట్రంప్ పోస్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీసైతం స్పందించారు. నేను కూడా ట్రంప్ తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం అంటూ మోదీ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. మరోవైపు.. భారతదేశంపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నాడు. భారత్, చైనా దేశాలపై సుంకాల భారాన్ని 100శాతం పెంచాలంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలను ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది.
యుక్రెయిన్ యుద్ధం ముగించే అంశంపై డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత దేశాన్ని ట్రంప్ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్సు కాల్ లో మాట్లాడారు.
యుక్రెయిన్ పై దాడిని కొనసాగిస్తున్న రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచాలంటే భారత్, చైనా దేశాలపై 100శాతం సుంకాలు విధించాలని, రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామని రష్యా, భారత్ చెప్పే వరకు వారిపై సుంకాల మోత మోగించాలని ట్రంప్ పేర్కొన్నట్లు తెలిసింది.
అయితే, అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారట. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
భారతదేశం ఉత్పత్తులపై ఇప్పటికే ట్రంప్ 50శాతం సుంకాలను విధించారు. చైనా ఎగుమతులపై సుంకాలు 30శాతం వరకు ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మరోసారి భారత్, చైనాలపై సుంకాల మోతను మోగించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









