యూఏఈ పై భారత్ ఘన విజయం
- September 11, 2025
అబుధాబి: ఆసియా కప్ 2025లో భారత్ బోణీ కొట్టింది.తన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 13.1 ఓవర్లలోనే 57 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలోనే చేజ్ చేసింది. 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి ఔటయ్యాడు.గిల్ 20 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేశారు. మరో 93 బంతులు మిగిలి ఉండగానే..టార్గెట్ ని ఫినిష్ చేసేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ చెలరేగాడు.4 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. మరో ఎండ్ లో శివమ్ దూబె వణికించాడు.3 వికెట్లు తీసుకున్నాడు.బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
భారత్ తన నెక్ట్స్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ 14వ తేదీన జరగనుంది.
స్కోర్లు..
యూఏఈ–13.1 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్
భారత్–4.3 ఓవర్లలో 60 పరుగులు
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు