30 బిలియన్ దిర్హామ్లతో డిజర్ట్ రోజ్ సిటీ
- July 19, 2016
దుబాయ్ మునిసిపాలిటీ ఎకో ఫ్రెండ్లీ డిజర్ట్ రోజ్ సిటీ ప్రాజెక్ట్కి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొంది. అల్ రువయ్యా ప్రాంతంలో ఈ సిటీ నిర్మితం కానుంది. 40 శాతం ఎలక్ట్రిసిటీని, అలాగే 40,000 క్యూబిక్ మీటర్స్ నీటినీ ఈ సిటీలో ఉండేవారికి అందించేలా ప్రాజెక్ట్ని రూపొందించారు. డిజర్ట్ రోజ్ షేప్లో డిజైన్ చేయబడ్డ ఈ సిటీ నిర్మాణం ప్రపంచంలోనే అత్యద్భుతంగా ఉండబోతోందని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా చెప్పారు. స్కూల్స్, షాపింగ్ సెంటర్స్, క్లినిక్స్, హాస్పిటల్స్, మసీదులు, పోలీస్ స్టేషన్ సహా పలు సౌకర్యాలు ఈ సిటీలో ఉంటాయి. సుమారు 30 బిలియన్ దిర్హామ్ల ఖర్చుతో 4,000 హెక్టార్లలో రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్లో 30,000 ఇళ్ళుంటాయి. ఇందులో 20,000 ఇళ్ళు ఎమిరేటీలకు, మిగిలిన 10,000 వలసదారులకోసం కేటాయిస్తారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









